పాఠశాలకు వెళ్లి.. పిల్లలతో గడిపిన దుబాయ్ రాజు

- September 11, 2017 , by Maagulf
పాఠశాలకు వెళ్లి.. పిల్లలతో గడిపిన దుబాయ్ రాజు

యూఏఈ: దుబాయ్ లో పాఠశాలలు 10 వ తారీఖుతో పున:ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. కొత్త తరగతులు, కొత్త పాఠ్యపుస్తకాలతో పిల్లలు కుస్తీ పడుతున్నారు. విద్యాసంవత్సరం మొదలయిన మొదటిరోజే.. విద్యార్థులకు కలలో కూడా ఊహించని సంతోషకర  అనుభవం ఎదురైంది. స్వయంగా దుబాయ్ రాజు వారి వద్దకు వచ్చి.. బాగా చదువుకోండంటూ ముచ్చటించడం విద్యార్థుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఆదివారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయిన సందర్భంగా దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కొన్ని పాఠశాలలను సందర్శించారు. ఆయనతోపాటు అత్యున్నత పదవిలో ఉన్న కొందరు మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. అధికారులకు, పాఠశాలల యాజమాన్యాలకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆయన చేసిన ఆకస్మిక పర్యటన చాలామందిని ఆశ్చర్యపరిచింది. పిల్లలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పిల్లలు దేశ భవిష్యత్తుకు చిహ్నమని, వారు ఉన్నత మార్గంలో ఉంటే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మహ్మద్ బిన్ రషీద్ అభిప్రాయపడ్డారు. పిల్లలతో దుబాయ్ రాజు గడిపిన మధురక్షణాల గురించి దుబాయి అధికారిక మీడియా ట్విటర్లో పోస్ట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com