కంచె ఐలయ్య పుస్తకంపై తెలంగాణ,ఏ.పి రాష్ట్రాల్లో రగడ
- September 11, 2017
మాజీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఐలయ్య రాసిన పుస్తకంపై ఆర్య వైశ్యులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఐలయ్యకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఐలయ్యపై చర్య తీసుకోవాలంటూ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం సమర్పించారు.
అటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ శివరాంపల్లిలోను వైశ్యులు ఆందోళన నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మైలార్ దేవ్ పల్లి చౌరస్తా ఐలయ్య బొమ్మ దగ్ధం చేశారు. గతంలోను ఐలయ్య అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ నాయకులు గణేష్ గుప్తా ఆరోపించారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంతో తమ మనోభావాలు కించపరిచిన ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









