కంచె ఐలయ్య పుస్తకంపై తెలంగాణ,ఏ.పి రాష్ట్రాల్లో రగడ

- September 11, 2017 , by Maagulf
కంచె ఐలయ్య పుస్తకంపై తెలంగాణ,ఏ.పి రాష్ట్రాల్లో రగడ

మాజీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఐలయ్య రాసిన పుస్తకంపై ఆర్య వైశ్యులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ తహసీల్దార్‌  కార్యాలయం ముందు ఐలయ్యకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఐలయ్యపై చర్య తీసుకోవాలంటూ తహసీల్దార్ సురేష్‌ కు వినతి పత్రం సమర్పించారు.

అటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌ శివరాంపల్లిలోను వైశ్యులు ఆందోళన నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మైలార్ దేవ్ పల్లి చౌరస్తా ఐలయ్య బొమ్మ దగ్ధం చేశారు. గతంలోను ఐలయ్య అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ నాయకులు గణేష్ గుప్తా ఆరోపించారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంతో తమ మనోభావాలు కించపరిచిన ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com