ఓ 18 ఏళ్ల యువకుడు బెల్జియం మేయర్‌ గొంతు కోసి హత్య చేసాడు

- September 12, 2017 , by Maagulf
ఓ 18 ఏళ్ల యువకుడు బెల్జియం మేయర్‌ గొంతు కోసి హత్య చేసాడు

బెల్జియంలో ఘోరం జరిగింది. తన తండ్రి చావుకు కారణమయ్యాడనే ఆగ్రహంతో ఏకంగా ఓ మేయర్‌ను హత్య చేశాడు ఓ 18 ఏళ్ల యువకుడు. అత్యంత దారుణంగా ఆయన గొంతుకోసి స్మశాన వాటికలో పడేశాడు. ఈ సంఘటన బెల్జియంలో తీవ్ర కలకలం రేపింది. ఆల్ఫ్రడ్‌ గడెన్నె(71) మేయర్‌ ముస్క్రాన్‌లోని తన నివాసం సమీపంలోని శ్మశాన వాటిక వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఈ దాడి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు ఆయనపై కక్షతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 60 వేల మంది ఉండే ముస్క్రాన్‌ ప్రాంతం ఫ్రాన్స్‌ సరిహద్దకు సమీపంలో ఉంటుంది. 2015లో ఓ ఉద్యోగిని ఆల్ఫ్రడ్‌ బాధ్యతల నుంచి తొలగించడంతో అవమాన భారంతో అతడు చనిపోయాడట. ఇప్పుడు అతడి కుమారుడే మేయర్‌పై కక్షతో ఈ దాడికి పాల్పడ్డాడని అంటున్నారు. అత్యంత దారుణంగా ఆయన కత్తితో ఆయన గొంతు కోసి హత్య చేసి చంపినట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com