ఓ 18 ఏళ్ల యువకుడు బెల్జియం మేయర్ గొంతు కోసి హత్య చేసాడు
- September 12, 2017
బెల్జియంలో ఘోరం జరిగింది. తన తండ్రి చావుకు కారణమయ్యాడనే ఆగ్రహంతో ఏకంగా ఓ మేయర్ను హత్య చేశాడు ఓ 18 ఏళ్ల యువకుడు. అత్యంత దారుణంగా ఆయన గొంతుకోసి స్మశాన వాటికలో పడేశాడు. ఈ సంఘటన బెల్జియంలో తీవ్ర కలకలం రేపింది. ఆల్ఫ్రడ్ గడెన్నె(71) మేయర్ ముస్క్రాన్లోని తన నివాసం సమీపంలోని శ్మశాన వాటిక వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఈ దాడి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు ఆయనపై కక్షతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 60 వేల మంది ఉండే ముస్క్రాన్ ప్రాంతం ఫ్రాన్స్ సరిహద్దకు సమీపంలో ఉంటుంది. 2015లో ఓ ఉద్యోగిని ఆల్ఫ్రడ్ బాధ్యతల నుంచి తొలగించడంతో అవమాన భారంతో అతడు చనిపోయాడట. ఇప్పుడు అతడి కుమారుడే మేయర్పై కక్షతో ఈ దాడికి పాల్పడ్డాడని అంటున్నారు. అత్యంత దారుణంగా ఆయన కత్తితో ఆయన గొంతు కోసి హత్య చేసి చంపినట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







