భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'స్పైడర్'
- September 12, 2017
సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'స్పైడర్'. సెప్టెంబరు 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేశ్ తొలిసారి తమిళంలో నటించిన చిత్రమిది. దీంతో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలో దాదాపు 800 స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట. అక్కడ 'స్పైడర్'ను పంపిణీ చేస్తున్న అట్మాస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి చిత్రాన్ని దాదాపు 800 స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. మహేశ్ సినీ కెరీర్లో అమెరికాలో అత్యధిక స్క్రీన్లపై విడుదల అవుతున్న చిత్రం ఇదేననని చెబుతున్నారు.
'బాహుబలి 2'ను అమెరికాలో 1000 స్క్రీన్లపై ప్రదర్శించారు. అక్కడ అత్యధిక స్క్రీన్లపై ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రమిదే. దీని తర్వాతి స్థానాన్ని 'స్పైడర్' దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ నెల 15న చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







