భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'స్పైడర్'
- September 12, 2017
సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'స్పైడర్'. సెప్టెంబరు 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేశ్ తొలిసారి తమిళంలో నటించిన చిత్రమిది. దీంతో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలో దాదాపు 800 స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట. అక్కడ 'స్పైడర్'ను పంపిణీ చేస్తున్న అట్మాస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి చిత్రాన్ని దాదాపు 800 స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. మహేశ్ సినీ కెరీర్లో అమెరికాలో అత్యధిక స్క్రీన్లపై విడుదల అవుతున్న చిత్రం ఇదేననని చెబుతున్నారు.
'బాహుబలి 2'ను అమెరికాలో 1000 స్క్రీన్లపై ప్రదర్శించారు. అక్కడ అత్యధిక స్క్రీన్లపై ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రమిదే. దీని తర్వాతి స్థానాన్ని 'స్పైడర్' దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ నెల 15న చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









