భారీగా అమ్ముడుపోయిన పవన్ త్రివిక్రంల మూవీ రైట్స్
- September 13, 2017
'కాటమరాయుడు' తర్వాత పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఫస్ట్లుక్ను ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. సినిమా అమెరికా, నైజాం హక్కులు రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తెలిపారు. అమెరికాలో రూ. 21 కోట్లకి, నైజాంలో రూ. 29 కోట్లకి అమ్ముడుపోయినట్లు ట్వీట్ చేశారు.
'బాహుబలి 2' కాకుండా థియేట్రికల్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రాబట్టిన తెలుగు చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
పవన్ 25వ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఖుష్బూ, మురళీశర్మ, రావురమేశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







