మలేషియా రాజధాని కౌలాలంపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం: 23 మంది టీచర్లు, విద్యార్థులు మృతి

- September 13, 2017 , by Maagulf
మలేషియా రాజధాని కౌలాలంపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం: 23 మంది టీచర్లు, విద్యార్థులు మృతి

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాలలో జరిగిన ఆ మాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు.
మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఉపాధ్యాయులు, విద్యార్థులు 23 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com