తెలంగాణ రాష్ట్రంకి రెండు స్వచ్చభారత్ అవార్డులు
- September 14, 2017
పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు ఆమ్రపాలి, భారతి
దేశవ్యాప్తంగా 5 జిల్లాలు ఎంపిక.. అందులో మనవే రెండు
'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు రెండు స్వచ్ఛతా అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఐదు జిల్లాలకు అవార్డులు దక్కగా అందులో రెండు(వరంగల్, మెదక్) తెలంగాణవే కావటం విశేషం. వీటిని గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ ప్రదానం చేసింది. పురస్కారాలను వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, మెదక్ కలెక్టర్ భారతి హోళికేరి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చేతుల మీదుగా అందుకున్నారు. శుభ్రత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలు, సాంకేతిక ఇనిస్టిట్యూట్లు, ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛతా ర్యాంకులు ఇచ్చారు. వాటిలో సాంకేతిక ఇనిస్టిట్యూట్ విభాగంలో గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు దక్కింది. ఈ పురస్కారాన్ని వర్సిటీ డీన్ శరత్కుమార్ అందుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







