తెలంగాణ రాష్ట్రంకి రెండు స్వచ్చభారత్ అవార్డులు
- September 14, 2017
పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు ఆమ్రపాలి, భారతి
దేశవ్యాప్తంగా 5 జిల్లాలు ఎంపిక.. అందులో మనవే రెండు
'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు రెండు స్వచ్ఛతా అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఐదు జిల్లాలకు అవార్డులు దక్కగా అందులో రెండు(వరంగల్, మెదక్) తెలంగాణవే కావటం విశేషం. వీటిని గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ ప్రదానం చేసింది. పురస్కారాలను వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, మెదక్ కలెక్టర్ భారతి హోళికేరి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చేతుల మీదుగా అందుకున్నారు. శుభ్రత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలు, సాంకేతిక ఇనిస్టిట్యూట్లు, ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛతా ర్యాంకులు ఇచ్చారు. వాటిలో సాంకేతిక ఇనిస్టిట్యూట్ విభాగంలో గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు దక్కింది. ఈ పురస్కారాన్ని వర్సిటీ డీన్ శరత్కుమార్ అందుకున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









