తెలంగాణ రాష్ట్రంకి రెండు స్వచ్చభారత్ అవార్డులు

- September 14, 2017 , by Maagulf
తెలంగాణ రాష్ట్రంకి రెండు  స్వచ్చభారత్ అవార్డులు

పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు ఆమ్రపాలి, భారతి
దేశవ్యాప్తంగా 5 జిల్లాలు ఎంపిక.. అందులో మనవే రెండు
 'స్వచ్ఛ భారత్‌' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు రెండు స్వచ్ఛతా అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఐదు జిల్లాలకు అవార్డులు దక్కగా అందులో రెండు(వరంగల్‌, మెదక్‌) తెలంగాణవే కావటం విశేషం. వీటిని గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ ప్రదానం చేసింది. పురస్కారాలను వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి, మెదక్‌ కలెక్టర్‌ భారతి హోళికేరి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చేతుల మీదుగా అందుకున్నారు. శుభ్రత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలు, సాంకేతిక ఇనిస్టిట్యూట్లు, ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛతా ర్యాంకులు ఇచ్చారు. వాటిలో సాంకేతిక ఇనిస్టిట్యూట్‌ విభాగంలో గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు దక్కింది. ఈ పురస్కారాన్ని వర్సిటీ డీన్‌ శరత్‌కుమార్‌ అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com