కోనేరు మధుకు 'ఎమ్మార్'తో సంబంధం లేదు
- September 14, 2017
హైదరాబాదు: ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించిన కేసుతో కోనేరు మధుకు సంబంధం లేదని, కుట్ర జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని మధు తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు. ఎమ్మార్ కుంభకోణంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు మధు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను జస్టిస్ శివశంకర్రావు గురువారం విచారించారు. 'ఎమ్మార్ కుంభకోణం కుట్ర ఇక్కడ జరిగింది. ఆ సమయంలో మధు విదేశాల్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకే మధు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అయితే ఆ డబ్బును మధు వాడుకోలేదు. తిరిగి వారికి చెల్లించారు. మధుపై కేసును కొట్టివేయండి' అని రోహత్గీ నివేదించారు. ఈ పిటిషన్పై సీబీఐ వాదనలు వినిపించేందుకు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







