కోనేరు మధుకు 'ఎమ్మార్'తో సంబంధం లేదు
- September 14, 2017
హైదరాబాదు: ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించిన కేసుతో కోనేరు మధుకు సంబంధం లేదని, కుట్ర జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని మధు తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు. ఎమ్మార్ కుంభకోణంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు మధు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను జస్టిస్ శివశంకర్రావు గురువారం విచారించారు. 'ఎమ్మార్ కుంభకోణం కుట్ర ఇక్కడ జరిగింది. ఆ సమయంలో మధు విదేశాల్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకే మధు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అయితే ఆ డబ్బును మధు వాడుకోలేదు. తిరిగి వారికి చెల్లించారు. మధుపై కేసును కొట్టివేయండి' అని రోహత్గీ నివేదించారు. ఈ పిటిషన్పై సీబీఐ వాదనలు వినిపించేందుకు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







