కోనేరు మధుకు 'ఎమ్మార్'తో సంబంధం లేదు
- September 14, 2017
హైదరాబాదు: ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించిన కేసుతో కోనేరు మధుకు సంబంధం లేదని, కుట్ర జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని మధు తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు. ఎమ్మార్ కుంభకోణంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు మధు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను జస్టిస్ శివశంకర్రావు గురువారం విచారించారు. 'ఎమ్మార్ కుంభకోణం కుట్ర ఇక్కడ జరిగింది. ఆ సమయంలో మధు విదేశాల్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ సూచన మేరకే మధు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అయితే ఆ డబ్బును మధు వాడుకోలేదు. తిరిగి వారికి చెల్లించారు. మధుపై కేసును కొట్టివేయండి' అని రోహత్గీ నివేదించారు. ఈ పిటిషన్పై సీబీఐ వాదనలు వినిపించేందుకు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









