కోనేరు మధుకు 'ఎమ్మార్‌'తో సంబంధం లేదు

- September 14, 2017 , by Maagulf
కోనేరు మధుకు 'ఎమ్మార్‌'తో సంబంధం లేదు

హైదరాబాదు: ఎమ్మార్‌ కుంభకోణానికి సంబంధించిన కేసుతో కోనేరు మధుకు సంబంధం లేదని, కుట్ర జరిగిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని మధు తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు. ఎమ్మార్‌ కుంభకోణంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్‌ కుమారుడు మధు దాఖలు చేసుకున్న క్వాష్‌ పిటిషన్‌ను జస్టిస్‌ శివశంకర్‌రావు గురువారం విచారించారు. 'ఎమ్మార్‌ కుంభకోణం కుట్ర ఇక్కడ జరిగింది. ఆ సమయంలో మధు విదేశాల్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ సూచన మేరకే మధు ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అయితే ఆ డబ్బును మధు వాడుకోలేదు. తిరిగి వారికి చెల్లించారు. మధుపై కేసును కొట్టివేయండి' అని రోహత్గీ నివేదించారు. ఈ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించేందుకు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com