బహ్రెయిన్లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు
- September 15, 2017
మనామా: నిన్న రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ఈ ప్రమాదాల్లో ఎవరూ మరణించడంగానీ, ఎవరికీ గాయాలవడంగానీ జరగలేదని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. హిద్లోని ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు సివిల్ డిఫెన్స్ టీమ్ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. మరో ఘటనలో షేక్ హమాద్ వెన్యూలోని లేబర్ క్యాంప్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనామాలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం బాగా సంభవించింది. 40 మందికి పైగా కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రమాద తీవ్రతను ముందే గుర్తించిన కార్మికులు అక్కడినుంచి తప్పించుకున్నారు. పూర్తిగా ఆ క్యాంప్ ధ్వంసం కావడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









