బహ్రెయిన్లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు
- September 15, 2017
మనామా: నిన్న రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ఈ ప్రమాదాల్లో ఎవరూ మరణించడంగానీ, ఎవరికీ గాయాలవడంగానీ జరగలేదని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. హిద్లోని ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు సివిల్ డిఫెన్స్ టీమ్ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. మరో ఘటనలో షేక్ హమాద్ వెన్యూలోని లేబర్ క్యాంప్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనామాలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం బాగా సంభవించింది. 40 మందికి పైగా కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రమాద తీవ్రతను ముందే గుర్తించిన కార్మికులు అక్కడినుంచి తప్పించుకున్నారు. పూర్తిగా ఆ క్యాంప్ ధ్వంసం కావడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







