బహ్రెయిన్లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు
- September 15, 2017
మనామా: నిన్న రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ఈ ప్రమాదాల్లో ఎవరూ మరణించడంగానీ, ఎవరికీ గాయాలవడంగానీ జరగలేదని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. హిద్లోని ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు సివిల్ డిఫెన్స్ టీమ్ సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని మినిస్ట్రీ పేర్కొంది. మరో ఘటనలో షేక్ హమాద్ వెన్యూలోని లేబర్ క్యాంప్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనామాలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం బాగా సంభవించింది. 40 మందికి పైగా కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రమాద తీవ్రతను ముందే గుర్తించిన కార్మికులు అక్కడినుంచి తప్పించుకున్నారు. పూర్తిగా ఆ క్యాంప్ ధ్వంసం కావడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









