ప్రముఖ నిర్మాత దిల్ రాజు పై కేసు నమోదు

- September 16, 2017 , by Maagulf
ప్రముఖ నిర్మాత దిల్ రాజు పై కేసు నమోదు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదయింది. ‘నా మనస్సు నిన్ను కోరె’ నవల రచయిత్రి శ్యామలారాణి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు తన నవలలోని స్టోరీని అనుమతి లేకుండా కాపీ కొట్టారంటూ ఫిర్యాదు చేశారు.

దీంతో నిర్మాత దిల్‌ రాజుపై పోలీసులు 120ఏ, 415, 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దిల్‌ రాజు నిర్మాణ సారధ్యంలో ప్రభాస్‌ హీరోగా కాజల్‌, తాప్సీ హీరోయిన్లుగా నటించిన మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ చిత్రానికి ధశరథ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com