మార్కెట్లో దూసుకెళ్తున్న ఇఇఎస్ఎల్
- September 16, 2017
విద్యుత్ను పొదుపు చేసే నాణ్యమైన ఎలక్ట్రిక్ ఉపకరణాలను అత్యంత చౌకధరలకే ప్రజలకు అందజేస్తూ సర్వత్రా విశేష మన్ననలను పొందుతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇఇఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) ఇప్పుడు మలేషియా మార్కెట్లో ప్రవేశించింది. దీంతో ఇఇఎస్ఎల్.. విద్యుత్ను ఆదా చేయడంలో ఎంతో సమర్ధవంతమైనవిగా పేరు పొందిన తమ ఎల్ఇడి బల్బులను మలేషియాలోని మెలాకా రాష్ట్రంలో అమ్మనుంది. గతంలో ఇఇఎస్ఎల్ బ్రిటన్లో చేపట్టిన ఇదేవిధమైన పథకం విజయవంతమవడంతో మెలాకా ముఖ్యమంత్రి దతుక్ సెరి ఉతమా ఇర్ హిజ్ ఇద్రిస్ బిన్ హిజ్ హరోన్ తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మెలాకా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 9 వాట్ల సామర్ధ్యం కలిగిన అత్యంత నాణ్యమైన 10 ఎల్ఇడి బల్బులను కేవలం 10 రింగిట్ల (మలేషియా కరెన్సీ) ప్రత్యేక ధరకే అందజేయనున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ బల్బులను అమ్ముతున్న ధరతో పోలిస్తే ఇది దాదాపు సగం ధర మాత్రమే. ప్రస్తుతం మెలాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగిస్తున్న 18 వాట్ల సిఎఫ్ఎల్ బల్బులను తొలగించి, వాటి స్థానంలో 9 వాట్ల సామర్ధ్యం కలిగివున్న ఎల్ఇడి బల్బులను దాదాపు 10 లక్షల మేరకు పంపిణీ చేయాలని ఇఇఎస్ఎల్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి మెలాకా రాష్ట్రంలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న గ్రీన్ గ్రోత్ ఏషియా అనే సంస్థ తగిన సహాయ, సహకారాలను అందజేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో ప్రస్తుతం ఒక్కో ఎల్ఇడి బల్బు సగటు ధర 3 నుంచి 5 డాలర్ల మేరకు ఉంది. దీనితో పోలిస్తే ఇఇఎస్ఎల్ అమ్ముతున్న ఎల్ఇడి బల్బుల ధర చాలా తక్కువ.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









