ప్రపంచపు చూపు... బహ్రైన్ వైపు
- October 30, 2015
ప్రపంచ నేతలు నేడు బహ్రైన్లో ప్రారంభమై , ఈ ఆదివారం వరకు కొనసాగనున్న 11 వ అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ప్రాంతీయ భద్రతా సదస్సు -' ద మనామా డైలాగ్ 2015' లో పాల్గొనడానికి రిట్జ్ కార్ల్టన్ బహ్రైన్, హోటెల్ అండ్ స్పా లో సమావేశం కానున్న సందర్భంలో ప్రపంచం అంతా బహ్రైన్ వైపు దృష్టి కేంద్రీకరించింది. నేటి రాత్రి బహ్రైన్ యువరాజు, మొదటి ఉపాధ్యక్షులు, డేప్యూటీ సుప్రీం కమాండర్ ఐన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా అతిధ్యమివ్వనున్న విందులో, ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా అల్ సిసి కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న పెరుగుతున్న తీవ్రవాదం, విభజనవాదం మరియు మధ్య ప్రాచ్య వివాదాలు వంటి సవాళ్లను గురించి చర్చించడానికి మధ్య ప్రాచ్యం మరియు ప్రపంచ వ్యాప్తంగా - బ్రిటన్ విదేశాంగ సెక్రటరీ ఫిలిప్ హ్యామండ్, అమెరికా డేప్యూటీ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్, అరబ్ లీగ్ సెక్రెటరీ జనరల్ డా. నాబీల్ అల్ అరబి, స్వీడన్ విదేశాంగ శాఖ మంత్రి మార్గొ ట్ వాల్స్ట్రోమ్, ఐక్యరాజ్య సమితి యెమన్ దేశ ప్రత్యేక రాయబారి ఇస్మైల్ షేక్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పధక అధికారి మరియు న్యూ జీలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, ఇరాక్ ఆర్ధిక మంత్రి హొషియార్ జాబారీ మరియు విదేశాంగ శాఖామంత్రి డా. ఇబ్రహీం అల్ జాఫారీ, యెమన్ విదేశాంగ శాఖామంత్రి రియాద్ యాసిన్, ఈజిప్టు విదేశాంగ శాఖమంత్రి సమేహ్ షౌక్రీ వంటి వివిధ దేశాల మంత్రులు మరియు నిపుణులు హాజరు కానున్న ఈ సమావేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి.
బహ్రైన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ, షేక్ ఖలిద్ అహ్మద్ బిన్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ స్థిరత్వాన్ని సాధించేందుకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అతి ముఖ్యమైనదిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







