ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక
- September 17, 2017
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్కు వేదికకానుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఇంటర్ రెగు సెపక్తక్రా చాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ టోర్నీ నిర్వహణపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ చాంబర్లో ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడామంత్రి టి.పద్మారావు చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేశారు. శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు. ఈ చాంపియన్షి్ ప్లో 20 దేశాలు పోటీపడనున్నాయి. ఆతిథ్య భారతతో పాటు జపాన్, థాయ్లాండ్, మలేసియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, దక్షిణకొరియా, చైనా, పాకిస్థాన్, నేపాల్, మయన్మార్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం, కంబోడియా, చైనీస్ తైపీ, ఇరాన్ తదితర దేశాలు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ జట్లకు హైటెక్ సిటీలోని హావాస్ హోటల్లో బస ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







