యూఏఈ తొలి స్మార్ట్ పోలీస్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
- September 18, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్లో స్మార్ట్ పోలీస్ సర్వీస్ సెంటర్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే ఈ స్థాయి సర్వీస్ సెంటర్ ఇదేనని ఆయన కొనియాడారు. ఇలాంటి సర్వీస్ సెంటర్స్ని మరిన్ని నెలకొల్పాల్సిందిగా దుబాయ్ పోలీస్కి షేక్ మొహమ్మద్ సూచనలు చేశారు. ప్రపంచంలోనే మేటి స్మార్ట్ సర్వీసుల్ని అందించేలా పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు రావడం ఆనందంగా ఉందని చెప్పారాయన. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, రోజులో 24 గంటలూ ఈ సర్వీస్ సెంటర్ పనిచేస్తుందనీ, 33 ఫుల్లీ ఆటోమేటెడ్ సబ్ సర్వీస్లకు ఇది అదనమని అన్నారు. పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ - దుబాయ్ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దహి ఖల్ఫాన్ తమీమ్ పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









