దాడికి గురైన సిరియన్ మహిళ అల్ అమాన్కి తరలింపు
- September 18, 2017
మనామా: సిరియాకి చెందిన ఓ మహిళ, భర్త చేతిలో అతి కిరాతకంగా దాడికి గురయిన ఘటనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. అతి కిరాతకంగా భర్త ఆమెను గాయపర్చగా, ఐదు రోజుల అనంతరం ఆమెను సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 35 ఏళ్ళ జోహ్రా సోభి, 52 ఏళ్ళ బహ్రెయినీ భర్త నుండి విడాకులు తీసుకుంది పదేళ్ళ వైవాహిక జీవితం అనంతరం. ఆమెకు ఐదుగురు సంతానం. తన మాజీ భర్త తనపై అతి దారుణంగా దాడికి పాల్పడి, చంపేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి పరిస్థితిని ఆమె కుమార్తెలు ఇరుగు పొరుగువారికి తెలపడంతో సమాచారం పోలీసులకు అందింది. ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించి, వాస్తవాల్ని వెలికి తీయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ టీమ్, ఎస్ఎంసిలో బాధితురాల్ని పరామర్శించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమెను షెల్టర్కి తరలించనున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









