దాడికి గురైన సిరియన్ మహిళ అల్ అమాన్కి తరలింపు
- September 18, 2017
మనామా: సిరియాకి చెందిన ఓ మహిళ, భర్త చేతిలో అతి కిరాతకంగా దాడికి గురయిన ఘటనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. అతి కిరాతకంగా భర్త ఆమెను గాయపర్చగా, ఐదు రోజుల అనంతరం ఆమెను సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 35 ఏళ్ళ జోహ్రా సోభి, 52 ఏళ్ళ బహ్రెయినీ భర్త నుండి విడాకులు తీసుకుంది పదేళ్ళ వైవాహిక జీవితం అనంతరం. ఆమెకు ఐదుగురు సంతానం. తన మాజీ భర్త తనపై అతి దారుణంగా దాడికి పాల్పడి, చంపేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి పరిస్థితిని ఆమె కుమార్తెలు ఇరుగు పొరుగువారికి తెలపడంతో సమాచారం పోలీసులకు అందింది. ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించి, వాస్తవాల్ని వెలికి తీయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ టీమ్, ఎస్ఎంసిలో బాధితురాల్ని పరామర్శించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమెను షెల్టర్కి తరలించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









