దాడికి గురైన సిరియన్ మహిళ అల్ అమాన్కి తరలింపు
- September 18, 2017
మనామా: సిరియాకి చెందిన ఓ మహిళ, భర్త చేతిలో అతి కిరాతకంగా దాడికి గురయిన ఘటనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. అతి కిరాతకంగా భర్త ఆమెను గాయపర్చగా, ఐదు రోజుల అనంతరం ఆమెను సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 35 ఏళ్ళ జోహ్రా సోభి, 52 ఏళ్ళ బహ్రెయినీ భర్త నుండి విడాకులు తీసుకుంది పదేళ్ళ వైవాహిక జీవితం అనంతరం. ఆమెకు ఐదుగురు సంతానం. తన మాజీ భర్త తనపై అతి దారుణంగా దాడికి పాల్పడి, చంపేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి పరిస్థితిని ఆమె కుమార్తెలు ఇరుగు పొరుగువారికి తెలపడంతో సమాచారం పోలీసులకు అందింది. ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించి, వాస్తవాల్ని వెలికి తీయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ టీమ్, ఎస్ఎంసిలో బాధితురాల్ని పరామర్శించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమెను షెల్టర్కి తరలించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









