దాడికి గురైన సిరియన్ మహిళ అల్ అమాన్కి తరలింపు
- September 18, 2017
మనామా: సిరియాకి చెందిన ఓ మహిళ, భర్త చేతిలో అతి కిరాతకంగా దాడికి గురయిన ఘటనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. అతి కిరాతకంగా భర్త ఆమెను గాయపర్చగా, ఐదు రోజుల అనంతరం ఆమెను సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 35 ఏళ్ళ జోహ్రా సోభి, 52 ఏళ్ళ బహ్రెయినీ భర్త నుండి విడాకులు తీసుకుంది పదేళ్ళ వైవాహిక జీవితం అనంతరం. ఆమెకు ఐదుగురు సంతానం. తన మాజీ భర్త తనపై అతి దారుణంగా దాడికి పాల్పడి, చంపేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి పరిస్థితిని ఆమె కుమార్తెలు ఇరుగు పొరుగువారికి తెలపడంతో సమాచారం పోలీసులకు అందింది. ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించి, వాస్తవాల్ని వెలికి తీయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ టీమ్, ఎస్ఎంసిలో బాధితురాల్ని పరామర్శించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమెను షెల్టర్కి తరలించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- దక్షిణ ఇరాన్ పై విరుచుకపడ్డ అమెరికా వైమానిక దళం!
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం
- ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC
- అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త 8-KM రోడ్ ప్రారంభం..!!
- షేర్డ్ హౌజింగ్.. భద్రతా నిబంధనలపై సౌదీ హెచ్చరిక..!!







