లండన్ నుంచి అదిరిపోయే వ్యూహంతో వస్తున్న జగన్
- September 19, 2017
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి పెద్ద కూతురు వర్షారెడ్డిని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటిక్స్ యూనివర్సిటీలో చేర్పించేందుకు వెళ్లారు. ఈనెల 11న అక్కడకు వెళ్లిన జగన్..19న తిరిగి రావాల్సి ఉంది. కానీ జగన్ ఇండియాకు వచ్చేందుకు తటపటాయిస్తున్నారట. అందుకే తన టూర్ ను పొడిగించుకున్నారని తెలుస్తోంది. కాకినాడ, నంద్యాల ఎన్నికలు తరువాత కార్యకర్తల్లోనే కాదు.. జగన్ లోను నిరుత్సాహం నెలకుంది. మరో నెల రోజుల్లో పాదయాత్ర ఉంది. దీంతో కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ ఏకంగా 13 రోజుల టూర్ లో ఉండటంతో ఆ పార్టీ నేతలు కాస్త కామ్ గానే ఉన్నారు. కోర్టు అనుమతితోనే జగన్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మరొక రోజు ఉండాలన్నా తిరిగి కోర్టు అనుమతి తీసుకోవాలి. మరి ఈనెల 21 వరకు జగన్ అక్కడే ఉంటున్న నేపధ్యంలో జగన్ కోర్టు అనుమతి తీసుకున్నారా లేదా అనే చర్చ జరుగుతోంది. తన కూతురుని కాలేజీలో జాయిన్ చెయ్యటానికి వెళ్ళాడు కాబట్టి, పర్సనల్ విషయం అని తెలుగుదేశం పార్టీ పెద్దగా రాజకీయం చెయ్యలేదు. కానీ ఐదు రోజులు అనుకున్న టూర్, 13 రోజులు కావటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.
తమ వ్యాపార లావాదేవీలను చక్క పెట్టుకునేందుకు జగన్ టూర్ ను ఉపయోగిస్తున్నాడనే విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ తన కూతురు ఉండటానికి లండన్ లో ఒక పెద్ద విల్లా కొన్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ టూర్ మీద నిఘా పెట్టి సిబిఐ కచ్చితమైన సమాచారం రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









