లండన్ నుంచి అదిరిపోయే వ్యూహంతో వస్తున్న జగన్
- September 19, 2017
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి పెద్ద కూతురు వర్షారెడ్డిని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటిక్స్ యూనివర్సిటీలో చేర్పించేందుకు వెళ్లారు. ఈనెల 11న అక్కడకు వెళ్లిన జగన్..19న తిరిగి రావాల్సి ఉంది. కానీ జగన్ ఇండియాకు వచ్చేందుకు తటపటాయిస్తున్నారట. అందుకే తన టూర్ ను పొడిగించుకున్నారని తెలుస్తోంది. కాకినాడ, నంద్యాల ఎన్నికలు తరువాత కార్యకర్తల్లోనే కాదు.. జగన్ లోను నిరుత్సాహం నెలకుంది. మరో నెల రోజుల్లో పాదయాత్ర ఉంది. దీంతో కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ ఏకంగా 13 రోజుల టూర్ లో ఉండటంతో ఆ పార్టీ నేతలు కాస్త కామ్ గానే ఉన్నారు. కోర్టు అనుమతితోనే జగన్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మరొక రోజు ఉండాలన్నా తిరిగి కోర్టు అనుమతి తీసుకోవాలి. మరి ఈనెల 21 వరకు జగన్ అక్కడే ఉంటున్న నేపధ్యంలో జగన్ కోర్టు అనుమతి తీసుకున్నారా లేదా అనే చర్చ జరుగుతోంది. తన కూతురుని కాలేజీలో జాయిన్ చెయ్యటానికి వెళ్ళాడు కాబట్టి, పర్సనల్ విషయం అని తెలుగుదేశం పార్టీ పెద్దగా రాజకీయం చెయ్యలేదు. కానీ ఐదు రోజులు అనుకున్న టూర్, 13 రోజులు కావటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.
తమ వ్యాపార లావాదేవీలను చక్క పెట్టుకునేందుకు జగన్ టూర్ ను ఉపయోగిస్తున్నాడనే విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ తన కూతురు ఉండటానికి లండన్ లో ఒక పెద్ద విల్లా కొన్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ టూర్ మీద నిఘా పెట్టి సిబిఐ కచ్చితమైన సమాచారం రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు.
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







