భారతదేశంలో విదేశీ నర్సింగ్ నియామక అవకాశం తిరిగి ప్రైవేటు సంస్థలకే అనుమతి
- September 19, 2017
కువైట్: భారత ప్రభుత్వం కోర్టు సూచన ప్రకారం గతంలో మాదిరిగా భారతీయ నర్సులను విదేశీ ఉపాధి కోసం నియమించేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతిస్తుంది. కొత్త సూచన ప్రకారం, ప్రైవేటు ఏజెన్సీలు కూడా నర్సులను ఆరు ప్రభుత్వ సంస్థలతో భర్తీ చేయగలవు. అంతకుముందు భారత ప్రభుత్వం నర్సుల విదేశీ నియామకాన్ని ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని అడ్డుకొంది. అధిక సంఖ్యలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత ఆ ప్రక్రియను ఆపివేసింది. అప్పట్లో వారు మంత్రిత్వ ఆస్పత్రులకు నర్సుల నియామకం కోసం ఆయా సంస్థలు ప్రతి నర్సు నుండి నియమాకానికి 6000 నుంచి 10,000 కువైట్ దినార్లను లంచంగా దిగమింగేవారు. డబ్బు మాత్రమే ప్రధానంగా వారు అతని / ఆమె నియామకాలకు అవసరమైన ప్రమాణాలు వారికి ఉన్నాయా లేవా ? అని పరిశీలనా మరియు విశేషాలను అనుసరించకుండా విదేశాలకు ఇబ్బడి ముబ్బడిగా పంపించేవారు. నర్సులు వృత్తిపరంగా, వైద్యపరంగా, సామాజికంగా లేదా నైతికంగా ఉద్యోగం కోసం సరిపోతుందా లేదా అని తనిఖీ చేయకుండా లంచాలు తీసుకోవడం జరుగుతుండటంతో భారత ప్రభుత్వము కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మరియు యుపి నుండి భారత నర్సుల విదేశీ నియామకాలను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వ సంస్థలను నిషేధించింది. భారతదేశంలోని ఇతర భాగాల నుండి ఉన్నత ప్రైవేట్ సంస్థలు ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. దీంతో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం కొత్త విదేశీ సంస్థలకు నర్సులను నియమించేందుకు ఏవైనా ప్రైవేటు ఏజెన్సీలను అనుమతిస్తుంది, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతి తాజాగా జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









