కువైట్లో భారతీయ మహిళ సమయస్ఫూర్తి
- September 19, 2017
కువైట్: ముసుగు దొంగకె ముచ్చెమటలు పట్టించిందా ఆ భారతీయ మహిళ ..విపత్తు సమయంలో వివేకంగా స్పందించిన తీరుకి కువైట్ ప్రభుత్వం ఆ మహిళను అభినందించింది. స్థానిక పత్రికలలో వచ్చిన కధనం ప్రకారం ఆదివారం మహబూలా అనే వ్యాపార సంస్థలోకి ఒక ఆగంతకుడు సాధారణ వ్యక్తి మాదిరిగా ఏదో కొనుగోలు చేసే నెపంతో లోపలకి వచ్చేడు. వారితో కొద్దిసేపు మాట్లాడిన నటించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా తన ముఖం కనిపించకుండా ముసుగు తగిలించుకొని దొంగ మాదిరిగా మారిపోయాడు.. ఆ సమయంలో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఆ సంస్థలో ఉన్నారు. తన వెంట తెచ్చుకున్నతుపాకీని వారిపై గురిపెట్టాడు. డబ్బులిమ్మని డిమాండ్ చేశాడు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన ఉద్యోగులు నోట మాట రాక నిలబడిపోయారు.ముగ్గురు ఉద్యోగుల్లో ఒక భారతీయ మహిళ కాగా, మిగతా ఇద్దరు ఈజిప్టు దేశానికి చెందిన పురుషులున్నారు. ఆ వ్యక్తికి డబ్బులిచ్చేందుకని భారతీయ మహిళ టేబుల్ డెస్కులో చూస్తున్నట్లుగా నటించింది. వెంటనే ఫైర్ అలారమ్ నొక్కింది. సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకుంటూ లోపలికొచ్చేసరికి ఆ వ్యక్తి పారిపోయాడు. భారతీయ మహిళ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను పోలీసులకు అందించారు. పోలీసులు భారతీయ మహిళ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రభుత్వాధికారులు కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









