డాక్టర్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అజారుద్దీన్‌

- September 19, 2017 , by Maagulf
డాక్టర్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అజారుద్దీన్‌

ఎప్పుడూ పేషెంట్లు, సర్జరీలతో బిజీగా ఉండే డాక్టర్లు క్రికెట్ మైదానంలో సత్తా చాటేందుకు సిధ్ధమవుతున్నారు.మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ క్రికెట్ లీగ్‌కు వచ్చే వారం తెరలేవనుంది. గత ఐదేళ్ళుగా తెలంగాణాకు పరిమితమైన ఈ లీగ్‌ను తొలిసారి జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నారు. లీగ్‌లో హైదరాబాద్ నుంచి రెండు జట్లు బరిలోకి దిగుతుండగా.. మహారాష్ట్ర,కేరళ,మైసూర్‌,ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మణిపూర్, జైపూర్ నుంచి కూడా డాక్టర్స్ టీమ్స్ ఆడనున్నాయి. ఈ లీగ్‌కు సంబంధించిన టీమ్స్ జెర్సీలను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాటు చేయాలన్న తన సూచనను పరిగణలోకి తీసుకున్న మైటీ స్పోర్ట్స్‌ను అజారుద్దీన్ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com