ఫేక్ గోల్ట్ ట్రేడర్స్ గుట్టు రట్టు
- September 19, 2017అబుదాబీ: అబుదాబీ పోలీసులు, 27 ఇలోల ఫేక్ గోల్డ్ జ్యుయెలరీని లోకల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్తో ఈ జ్యుయెలరీని రూపొందించారని పోలీసులు చెప్పారు. మొత్తం 26 జ్యుయెలరీ షోరూమ్లు ఈ కమర్షియల్ ఫ్రాడ్లో భాగం పంచుకున్నాయని వారు వివరించారు. వీటిల్లో 11 ఔట్లెట్స్ ఒకే వ్యక్తికి చెందినవి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాల్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ - అబుదాబీ పోలీస్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ బోరాషీద్ మాట్లాడుతూ, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఈ నకిలీ జ్యుయెలరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోల్డ్ మార్కెట్లో కమర్షియల్ ఫ్రాడ్కి సంబంధించి ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెంట్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలను నిర్వహించి ఈ ఫ్రాడ్ని వెలికి తీశారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు