ఫేక్ గోల్ట్ ట్రేడర్స్ గుట్టు రట్టు
- September 19, 2017
అబుదాబీ: అబుదాబీ పోలీసులు, 27 ఇలోల ఫేక్ గోల్డ్ జ్యుయెలరీని లోకల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్తో ఈ జ్యుయెలరీని రూపొందించారని పోలీసులు చెప్పారు. మొత్తం 26 జ్యుయెలరీ షోరూమ్లు ఈ కమర్షియల్ ఫ్రాడ్లో భాగం పంచుకున్నాయని వారు వివరించారు. వీటిల్లో 11 ఔట్లెట్స్ ఒకే వ్యక్తికి చెందినవి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాల్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ - అబుదాబీ పోలీస్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ బోరాషీద్ మాట్లాడుతూ, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఈ నకిలీ జ్యుయెలరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోల్డ్ మార్కెట్లో కమర్షియల్ ఫ్రాడ్కి సంబంధించి ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెంట్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలను నిర్వహించి ఈ ఫ్రాడ్ని వెలికి తీశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







