ప్రమాదకర స్థితిలో ల్యాబర్ క్యాంప్
- September 19, 2017
మనామా: అత్యంత ప్రమాదకర స్థితిలో ఓ ల్యాబర్ క్యాంప్ నిర్వహించబడ్తోంది. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు ఈ భవనంలో నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే, చర్యలు ప్రారంభించారు. మునిసిపల్ అధికారులు, ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. శ్లాబ్ పైనుంచి పెచ్చులు జారి పడి, కొన్ని నెలల క్రితం ఇందులో నివసిస్తున్న కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించి ఓనర్, అక్రమంగా అదనపు రూమ్లను నిర్వహించి, సొమ్ము చేసుకుంటున్నారని బాధిత కార్మికులు పేర్కొన్నారు. ఈ లేబర్ క్యాంప్లో టైలరింగ్ షాప్ కూడా నిర్వహించబడ్తోంది. 100 నుంచి 150 బహ్రెయినీ దినార్స్ వరకు ఒక్కో కార్మికుడు ఇక్కడ ఉండేందుకు చెల్లిస్తున్నట్లు అక్కడ ఉంటోన్న కార్మికులు తెలిపారు. ల్యాండ్ లార్డ్ తమ పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోవడంలేదని, భద్రత పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదని కార్మికులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







