ప్రమాదకర స్థితిలో ల్యాబర్ క్యాంప్
- September 19, 2017
మనామా: అత్యంత ప్రమాదకర స్థితిలో ఓ ల్యాబర్ క్యాంప్ నిర్వహించబడ్తోంది. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు ఈ భవనంలో నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే, చర్యలు ప్రారంభించారు. మునిసిపల్ అధికారులు, ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. శ్లాబ్ పైనుంచి పెచ్చులు జారి పడి, కొన్ని నెలల క్రితం ఇందులో నివసిస్తున్న కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించి ఓనర్, అక్రమంగా అదనపు రూమ్లను నిర్వహించి, సొమ్ము చేసుకుంటున్నారని బాధిత కార్మికులు పేర్కొన్నారు. ఈ లేబర్ క్యాంప్లో టైలరింగ్ షాప్ కూడా నిర్వహించబడ్తోంది. 100 నుంచి 150 బహ్రెయినీ దినార్స్ వరకు ఒక్కో కార్మికుడు ఇక్కడ ఉండేందుకు చెల్లిస్తున్నట్లు అక్కడ ఉంటోన్న కార్మికులు తెలిపారు. ల్యాండ్ లార్డ్ తమ పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోవడంలేదని, భద్రత పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదని కార్మికులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









