ప్రమాదకర స్థితిలో ల్యాబర్ క్యాంప్
- September 19, 2017
మనామా: అత్యంత ప్రమాదకర స్థితిలో ఓ ల్యాబర్ క్యాంప్ నిర్వహించబడ్తోంది. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు ఈ భవనంలో నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే, చర్యలు ప్రారంభించారు. మునిసిపల్ అధికారులు, ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. శ్లాబ్ పైనుంచి పెచ్చులు జారి పడి, కొన్ని నెలల క్రితం ఇందులో నివసిస్తున్న కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించి ఓనర్, అక్రమంగా అదనపు రూమ్లను నిర్వహించి, సొమ్ము చేసుకుంటున్నారని బాధిత కార్మికులు పేర్కొన్నారు. ఈ లేబర్ క్యాంప్లో టైలరింగ్ షాప్ కూడా నిర్వహించబడ్తోంది. 100 నుంచి 150 బహ్రెయినీ దినార్స్ వరకు ఒక్కో కార్మికుడు ఇక్కడ ఉండేందుకు చెల్లిస్తున్నట్లు అక్కడ ఉంటోన్న కార్మికులు తెలిపారు. ల్యాండ్ లార్డ్ తమ పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోవడంలేదని, భద్రత పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదని కార్మికులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









