బహ్రెయిన్లో పెరిగిన ఈ-ట్రాన్స్ఫర్స్
- September 21, 2017
మనామా: బహ్రెయిన్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (ఇఎఫ్టిఎస్), 2017 తొలి సగంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. ఫావ్రి ప్లస్, ఫావ్రి మరియు ఫాతీర్ సిస్టమ్స్ ద్వారా ఈ-ట్రాన్స్ఫర్స్ బాగా పెరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించినట్లు పేర్కొంది. 2015 నవంబర్ 5న ఇఎఫ్టిఎస్ ప్రారంభమయ్యింది. లోక్ బ్యాంకుల నుంచి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఈ ఈఎఫ్టిఎస్ ఉద్దేశ్యం. ఫావ్రి ప్లస్ లావాదేవీలు 153,000 గా నమోదయ్యాయి. వీటి విలువ 37.9 మిలియన్ బహ్రెయినీ దినార్స్. ఈ మొత్తం 211 శాతం అధికంగా పేర్కొంటున్నారు అధికారులు. ఫావ్రి లావాదేవీలు 2.4 మిలియన్ కాగా వీటి విలువ 4.6 బిలియన్ బహ్రెయినీ దినార్స్. ఈ వృద్ధిపై బ్యాంకింగ్ ఆపరేషన్స్ - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ సల్మాన్ బిన్ ఇసా అల్ ఖలీఫా మాట్లాడుతూ, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ ముందంజలో వుంటోందని ప్రశంసించారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









