యూఏఈ తొమ్మిదేళ్ళ రక్తచరిత్రకు ముగింపు
- September 21, 2017
రెండు కుటుంబాల మధ్య తొమ్మిదేళ్ళుగా నడుస్తున్న రక్తచరిత్రకు ఎట్టకేలకు ముగింపు పడింది. 2008లో అల్ అహ్బాబి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, అల్ బ్లౌషి కుటుంబానికి చెందిన యువకుడ్ని చంపేయడంతో ఈ వివాదం రాజుకుంది. 2012లో బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, వైరి వర్గానికి చెందిన ఇద్దర్ని హతమార్చడంతో ఈ రక్త చరిత్ర ముదిరి పాకాన పడింది. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్యా దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. యూఏఈకి చెందిన ప్రముఖులు ఈ వివాదానికి పరిష్కారం పలికేందుకు ముందుకొచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకూ అంగీకరించారు. ఇకపై తమ మధ్య ఎలాంటి గొడవలు ఉండవని పెద్దల సమక్షంలో వారంతా ప్రతిజ్ఞ చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







