తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్న రోబోలు
- September 23, 2017
ఇంతవరకూ ఆపరేషన్లలో డాక్టర్లకు సహాయం చేసిన మరమనుషులు.. ఇప్పుడు తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్నాయి. చైనాలోని ఓ రోబో.. డెంటిస్ట్ అవతారం ఎత్తింది. ఓ పేషెంట్కు.. రెండు పళ్లను ఫిక్స్ చేసింది. డెంటిస్ట్ రోబోను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. మనుషుల సహాయం లేకుండానే ఇది చికిత్స చేయగలదు. మనుషుల వల్ల జరిగే పొరపాట్లేవీ దీనివల్ల జరగవంటున్నారు. చైనాలో ప్రస్తుతం డెంటిస్ట్ల కొరత చాలా ఎక్కువగా ఉందట. ఈ రోబో వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందంటున్నారు.
డెంటింస్ట్ రోబో చేస్తున్న ఫస్ట్ ట్రీట్మెంట్ కావడంతో.. డాక్టర్లు కూడా దానిపక్కనే ఉండి ఎలా చేస్తుందో పరీక్షించారు. అయితే.. దానికి ఎలాంటి సాయం మాత్రం చేయలేదు. అన్ని పనులూ అదే చేసుకుంది. దాదాపు గంటసేపు ట్రీట్మెంట్ చేసిన రోబో.. ఓ మహిళకు జాగ్రత్తగా రెండు కొత్త పళ్లను అమర్చింది. ఈ పళ్లను కూడా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేశారట. ఫస్ట్ ట్రీట్మెంట్ సక్సెస్ కావడంతో.. ఇలాంటి మరిన్ని రోబోలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు చైనా పరిశోధకులు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







