యెమెన్ రెబెల్ క్షిపణిని సౌదీ సమర్ధవంతంగా అడ్డుకొంది
- September 24, 2017
సౌదీ అరేబియా: యెమెన్ నుంచి వెలువడిన ఒక రెబెల్ క్షిపణిని సౌదీ అరేబియా దళాలు శనివారం అర్ధరాత్రి సమర్ధవంతంగా అడ్డుకొంది. రాజ్య స్థాపనకు గుర్తుగా దేశవ్యాప్తంగా జరిపిన వేడుకలు మధ్యలో ఉన్నాయి. సౌదీ అధినేత సంకీర్ణ ప్రధానమైన ఖమిస్ ముషిత్ ను లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణి యెమెన్ నుంచి ప్రయోగించబడింది. రక్షణ కార్యకలాపాలు ఎయిర్ బేస్ ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్షిపణి ప్రయోగం కారఖ్నంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం లేకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. "సౌదీ రాయల్ వైమానిక దళం యెమానీ భూభాగంలోని ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కనుగొన్నట్లు తెలిపింది," సంకీర్ణ దళాలు ఆ ప్రయోగశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. "సౌదీ అరేబియా రాజ్యంలో జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంది, కచేరీలు, జానపద నృత్యం మరియు బాణాసంచాలతో సందడి చేస్తున్న సమయంలో ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులు చేయడం ఎంతో తీవ్రమైన చర్య అని ఆయన అన్నారు.అలాగే దక్షిణ సరిహద్దుపై మరింత తరచుగా స్వల్ప-శ్రేణి రాకెట్ ప్రయోగాలు అధికమైనట్లు ఆయన తెలిపారు.గతంలో యెమెన్లో తిరుగుబాటుదారులపై సంకీర్ణ వైమానిక దాడులను నిర్వహించబడ్డాయి. గత వారం, తిరుగుబాటుదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వద్ద క్షిపణులను ప్రయోగించేందుకు మరియు ఎర్ర సముద్రంలో సౌదీ ట్యాంకర్లపై దాడి చేసేందుకు యత్నించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







