ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- January 21, 2026
యూఏఈ: ఇండియాకు చెందిన విమానయాన సంస్థ స్పైస్జెట్ ఫిబ్రవరి 5 నుండి అహ్మదాబాద్ మరియు షార్జా మధ్య నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా గుజరాత్ మరియు యూఏఈ మధ్య విమాన కనెక్టివిటీ బలోపేతం అవుతుందని వెల్లడించింది. ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
దుబాయ్ తర్వాత షార్జా యూఏఈలో స్పైస్జెట్ కు రెండవ గమ్యస్థానంగా ఉండనుంది. కొత్త సర్వీస్ మంగళవారాలు మరియు బుధవారాలు మినహా వారానికి ఐదు రోజులు నడుస్తుంది. అహ్మదాబాద్ నుండి విమానాలు రాత్రి 8:20 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు షార్జాకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణం రాత్రి 11.20 గంటలకు షార్జా నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటాయని అని స్పైస్జెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డెబోజో మహర్షి తెలిపారు.
ఎయిర్లైన్ వెబ్సైట్లోని బుకింగ్ వివరాల ప్రకారం, రిటర్న్ ఛార్జీలు ప్రస్తుతం Dh900 నుండి అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్–షార్జా ఫ్లైట్ బుకింగ్లను స్పైస్జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









