ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- January 21, 2026
యూఏఈ: ఇండియాకు చెందిన విమానయాన సంస్థ స్పైస్జెట్ ఫిబ్రవరి 5 నుండి అహ్మదాబాద్ మరియు షార్జా మధ్య నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా గుజరాత్ మరియు యూఏఈ మధ్య విమాన కనెక్టివిటీ బలోపేతం అవుతుందని వెల్లడించింది. ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
దుబాయ్ తర్వాత షార్జా యూఏఈలో స్పైస్జెట్ కు రెండవ గమ్యస్థానంగా ఉండనుంది. కొత్త సర్వీస్ మంగళవారాలు మరియు బుధవారాలు మినహా వారానికి ఐదు రోజులు నడుస్తుంది. అహ్మదాబాద్ నుండి విమానాలు రాత్రి 8:20 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు షార్జాకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణం రాత్రి 11.20 గంటలకు షార్జా నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటాయని అని స్పైస్జెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డెబోజో మహర్షి తెలిపారు.
ఎయిర్లైన్ వెబ్సైట్లోని బుకింగ్ వివరాల ప్రకారం, రిటర్న్ ఛార్జీలు ప్రస్తుతం Dh900 నుండి అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్–షార్జా ఫ్లైట్ బుకింగ్లను స్పైస్జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









