ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- January 21, 2026
యూఏఈ: ఇండియాకు చెందిన విమానయాన సంస్థ స్పైస్జెట్ ఫిబ్రవరి 5 నుండి అహ్మదాబాద్ మరియు షార్జా మధ్య నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా గుజరాత్ మరియు యూఏఈ మధ్య విమాన కనెక్టివిటీ బలోపేతం అవుతుందని వెల్లడించింది. ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
దుబాయ్ తర్వాత షార్జా యూఏఈలో స్పైస్జెట్ కు రెండవ గమ్యస్థానంగా ఉండనుంది. కొత్త సర్వీస్ మంగళవారాలు మరియు బుధవారాలు మినహా వారానికి ఐదు రోజులు నడుస్తుంది. అహ్మదాబాద్ నుండి విమానాలు రాత్రి 8:20 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు షార్జాకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణం రాత్రి 11.20 గంటలకు షార్జా నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటాయని అని స్పైస్జెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డెబోజో మహర్షి తెలిపారు.
ఎయిర్లైన్ వెబ్సైట్లోని బుకింగ్ వివరాల ప్రకారం, రిటర్న్ ఛార్జీలు ప్రస్తుతం Dh900 నుండి అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్–షార్జా ఫ్లైట్ బుకింగ్లను స్పైస్జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









