ఇక పై విమానాశ్రయాలలో సీఐఎస్‌ఎఫ్‌ భద్రత

- September 24, 2017 , by Maagulf
ఇక పై విమానాశ్రయాలలో సీఐఎస్‌ఎఫ్‌ భద్రత

ఉడాన్‌ పేరుతో తక్కువ ఖర్చుతో ప్రాంతీయ అనుసంధానత కల్పించడానికి అమల్లోకి వచ్చిన పథకం కింద వివిధ విమానాశ్రయాలకు అవసరమైన భద్రత కల్పించాలని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌) నిర్ణయించింది. ఉగ్రవాద ముప్పును నివారించడానికి వీలుగా ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించింది. కొత్తగా రాకపోకలు మొదలైన విమానాశ్రయాలకు 13 నుంచి 44 మంది సిబ్బందితో సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పిస్తుంది. శాశ్వత ప్రాతిపదికన వీరిని మోహరించే బదులు విమానాలు రాకపోకలుచేసే సమయాల్లో మాత్రమే సేవలందేలా చేయనున్నామనీ, ఇది ఆర్థికంగానూ మెరుగైన ప్రతిపాదన అనీ సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఒ.పి.సింగ్‌ ఒక వార్తాసంస్థకు తెలిపారు. విమానాశ్రయాల వారీగా కాకుండా విమానాల వారీగా భద్రత కల్పించడం ఉభయులకూ ప్రయోజనకరమని చెప్పారు. సమీపంలోని సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌ నుంచి బలగాలను విమానాశ్రయానికి పంపించి, అన్ని రకాల తనిఖీలను వారి చేత చేయించాక మళ్లీ అదే యూనిట్‌కు మళ్లిపోయేలా చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించామనీ, అక్కడి నుంచి ఆమోదం లభించాక ఈ తరహా భద్రత అమల్లోకి వస్తుందని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com