కోవా సేమ్యా పాయసం
- September 25, 2017
కావలసినవి : సేమ్యా - 400గ్రా, పంచదార - 400గ్రా, నెయ్యి - 150గ్రా, పాలు - 400 మి. లీ, కుంకుమ పువ్వు - అర టీ స్పూన్
అలంకరణకి, కోవా - 200 గ్రాములు, పిస్తా (ముక్కలుగా తరిగినవి) - 10 గ్రాములు, బాదం పప్పు (ముక్కలుగా తరిగినవి)- 30 గ్రాములు
జీడిపప్పు (ముక్కలుగా తరిగినవి) - 50 గ్రాములు
తయారీ విధానం...
పాలలో నానబెట్టిన కుంకుమపువ్వుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కోవాని చిదిమి బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగించి పక్కన పెట్టుకోవాలి.
నెయ్యిని వేడి చేసి అందులో సేమ్యా వేసి సన్నని సెగ మీద బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించి అందులో పాలుపోయాలి. రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చాక పంచదారని కూడా వేసి బాగా కలియబెట్టండి. పంచదార కరిగి నీరు ఇగిరి పోయిందాకా మెల్లిగా ఉడికించండి. అందులో కుంకుమపువ్వుని కూడా వేసి సేమ్యా పొడిగా అయిన తరువాత సగం కోవాని అందులో వేసి బాగా కలపండి. ఒక గిన్నె తీసుకుని అందులో సేమ్యా పాయసాన్ని వేసి దానిపైన మిగిలిన కోవా, బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి వడ్డించండి. ఇది నలుగురికి సరిపోతుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









