నాన్ క్రిమినల్ అపెన్స్లకు అమ్నెస్టీ:షార్జా రూలర్
- September 26, 2017
షార్జా: షార్జా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, భారతదేశంలోని కేరళలో పర్యటిస్తున్న సందర్భంలో, కీలక ప్రకటన చేశారు. షార్జా జైలులో శిక్ష అనుభవిస్తోన్న వివిధ జాతీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు చెప్పారాయన. నాన్ క్రిమినల్ అఫెన్స్ల కారణంగా మూడేళ్ళ జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు ఈ క్షమాభిక్ష వర్తించనుంది. యూనివర్సీటీ ఆఫ్ కాలికట్ నుంచి డాక్టరేట్ అందుకున్న షార్జా రూలర్, ఈ ప్రకటన చేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, షార్జా జైలులో మగ్గుతున్న ఖైదీలు (లేబర్ సంబంధిత, వీసా కేసుల కారణాలతో) విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరడంతో షార్జా రూలర్ ఈ నిర్ణయం ప్రకటించారు. బుధవారం కోచిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి పాల్గొంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







