సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- July 20, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) విడుదల చేసిన 'ఇంటర్నెట్ 2025' నివేదిక ప్రకారం.. సౌదీలో 45.2 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు ఇప్పటికే AI టూల్స్ను ఉపయోగిస్తున్నారు. CST విడుదల చేసిన ఈ ఐదో వార్షిక నివేదికలో సౌదీ డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, ఇంటర్నెట్ వినియోగ ధోరణులు, కొత్త సాంకేతికతల విస్తరణపై సమగ్ర విశ్లేషణ అందించింది.
నివేదిక ప్రకారం, సౌదీలో ఒక్కో వ్యక్తి నెలకు సగటున 53 జీబీ మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్నాడు. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే, మొబైల్ ఇంటర్నెట్ మీడియం డౌన్లోడ్ వేగం 216 Mbpsగా నమోదైందని, ఈ సూచీలో సౌదీ అరేబియా జీ20 దేశాల్లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిందని CST వెల్లడించింది.
సౌదీలోని 61.3 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు ఏడు గంటలకు పైగా ఆన్లైన్లో గడుపుతున్నారని నివేదిక పేర్కొంది. ఇది ప్రజల దైనందిన జీవితంలో డిజిటల్ సేవల వినియోగం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోందని తెలిపింది. సోషల్ మీడియా, ప్రభుత్వ సేవలు, స్పోర్ట్స్, ఏఐ వంటి విభాగాల్లో అత్యధికంగా ఉపయోగిస్తున్న, ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్ల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది.
వీటితోపాటు సౌదీ (.sa) డొమైన్ పేర్ల నమోదులో ఏడాదికి 18 శాతం వృద్ధి నమోదైందని, దేశీయ వెబ్సైట్లపై వినియోగదారుల విశ్వాసం పెరుగుతోందని CST పేర్కొంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అలవాట్లు, ఎక్కువగా ఉపయోగిస్తున్న సెర్చ్ ఇంజిన్లు, సౌదీ డిజిటల్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక సూచీలను కూడా ఈ నివేదికలో వెల్లడించింది.
డిజిటల్ సేవల సామర్థ్యాన్ని మరింత పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో సౌదీ ఇంటర్నెట్ వ్యవస్థ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు CST వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







