షార్జా రూలర్కి భారత విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు
- September 28, 2017
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి కృతజ్ఞతలు తెలిపారు. 149 మంది భారత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినందుకుగాను సుష్మా స్వరాజ్, షార్జా రూలర్కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మానవతా దృక్పథంతో షార్జా రూలర్ క్షమాభిక్ష పెట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. నాన్ సీరియస్ క్రైమ్స్ కారణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు క్షమాభిక్ష పెడుతున్నట్లు షార్జా రూలర్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో 149 మంది భారతీయ ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి మేరకు షార్జా రూలర్ ఈ నిర్ణయం ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







