షార్జా రూలర్‌కి భారత విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు

- September 28, 2017 , by Maagulf
షార్జా రూలర్‌కి భారత విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమికి కృతజ్ఞతలు తెలిపారు. 149 మంది భారత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినందుకుగాను సుష్మా స్వరాజ్‌, షార్జా రూలర్‌కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మానవతా దృక్పథంతో షార్జా రూలర్‌ క్షమాభిక్ష పెట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. నాన్‌ సీరియస్‌ క్రైమ్స్‌ కారణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు క్షమాభిక్ష పెడుతున్నట్లు షార్జా రూలర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో 149 మంది భారతీయ ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విజ్ఞప్తి మేరకు షార్జా రూలర్‌ ఈ నిర్ణయం ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com