దసరా వేడుకల్లో పాల్గొననున్నభారత్ ప్రధాని,రాష్ట్రపతి
- September 30, 2017
న్యూ ఢిల్లీ: ఎర్రకోటలో నిర్వహించే దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు మోదీ.ఈ రోజు ఎర్రకోటలో జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి కూడా దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
దసరా వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత మోదీ దసరా వేడుకలను ఢిల్లీలో జరుపుకోవడం ఇది రెండోసారి. 2015లో ఏపీలోని అమరావతిలో మోదీ పర్యటించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2016లో లక్నోలో దసరా వేడుకలను జరుపుకున్నారు ప్రధాని మోదీ.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







