దసరా వేడుకల్లో పాల్గొననున్నభారత్ ప్రధాని,రాష్ట్రపతి

- September 30, 2017 , by Maagulf
దసరా వేడుకల్లో పాల్గొననున్నభారత్ ప్రధాని,రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ: ఎర్రకోటలో నిర్వహించే దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు మోదీ.ఈ రోజు ఎర్రకోటలో జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి కూడా దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

దసరా వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత మోదీ దసరా వేడుకలను ఢిల్లీలో జరుపుకోవడం ఇది రెండోసారి. 2015లో ఏపీలోని అమరావతిలో మోదీ పర్యటించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2016లో లక్నోలో దసరా వేడుకలను జరుపుకున్నారు ప్రధాని మోదీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com