ఏపీలో షూటింగులకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే బాలకృష్ణ
- September 30, 2017
విజయవాడ: రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని... యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు చొరవ తీసుకుంటామని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ బస్టాండ్లోని ఎన్టీఆర్ భవన్ నాలుగో అంతస్తులో చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యాలయాన్ని సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణతో కలిసి బాలకృష్ణ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఈ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించినట్లు తెలిపారు. భాషకు, కళకు బేధం లేదని... రాష్ట్రం విడిపోయిన తరుణంలో ప్రభుత్వ ఖజానాకు చలనచిత్ర కళాకారులు తమ వంతు ఆదాయం సమకూర్చేందుకు ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి మొత్తం తరలి రావాలని కోరుకోవడం లేదని.. చిన్న చిత్రాలు, టీవీ సీరియళ్ల చిత్రీకరణను ప్రోత్సహిస్తామన్నారు. సినీ పరిశ్రమలోని ఎందరో ప్రముఖులకు కృష్ణా జిల్లాలో అనుబంధం ఉందన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







