ఏపీలో షూటింగులకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే బాలకృష్ణ
- September 30, 2017
విజయవాడ: రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని... యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు చొరవ తీసుకుంటామని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ బస్టాండ్లోని ఎన్టీఆర్ భవన్ నాలుగో అంతస్తులో చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యాలయాన్ని సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణతో కలిసి బాలకృష్ణ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఈ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించినట్లు తెలిపారు. భాషకు, కళకు బేధం లేదని... రాష్ట్రం విడిపోయిన తరుణంలో ప్రభుత్వ ఖజానాకు చలనచిత్ర కళాకారులు తమ వంతు ఆదాయం సమకూర్చేందుకు ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి మొత్తం తరలి రావాలని కోరుకోవడం లేదని.. చిన్న చిత్రాలు, టీవీ సీరియళ్ల చిత్రీకరణను ప్రోత్సహిస్తామన్నారు. సినీ పరిశ్రమలోని ఎందరో ప్రముఖులకు కృష్ణా జిల్లాలో అనుబంధం ఉందన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









