మవా కచోరీ

- September 30, 2017 , by Maagulf
మవా కచోరీ

కావలసిన పదార్థాలు: మైదా పిండి- ఒక కప్పు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, గోరు వెచ్చని నీళ్లు- ఒక కప్పు, మీగడ- అరకప్పు, పాల పొడి- ఒక కప్పు, బాదం, పిస్తా పలుకులు- పావు కప్పు, యాలకల పొడి- అర టీస్పూను, చక్కెర- ఒకటిన్నరకప్పు, కుంకుమ పువ్వు- చిటికెడు. 
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, నెయ్యి వేసి నీళ్లు పోస్తూ మెత్తగా కలిపి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో ఒక కప్పు చక్కెర, అరకప్పు నీళ్లు పోసి పాకం అయ్యేదాక మరిగించాలి. తరువాత కుంకుమ పువ్వు, యాలకలపొడి వేసి రెండు నిమిషాలు మరిగించి స్టవ్‌ ఆపేయాలి. వేరొక గిన్నెలో మీగడ, పాలపొడి వేసి చిన్నమంటపై అది ముద్దలా అయ్యేవరకు వేడి చేయాలి. నాలుగు నిమిషాల తరువాత బాదం, పిస్తా పలుకులు, యాలకలపొడి వేసి మిశ్రమంలోని నీరంతా ఆవిరయ్యాక స్టవ్‌ ఆపేయాలి. ముందుగా కలుపుకున్న పిండిని అప్పాల్లాగా చేసి మధ్యలో ఈ మిశ్రమం పెట్టి మళ్లీ దాన్ని ఉండలా చేసి నూనెలో వేగించాలి. అంతే.... వీటిపై పాకం వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com