షిర్డీ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్రపతి
- October 01, 2017
షిర్డీ యాత్రికులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం అహ్మద్నగర్లో ప్రారంభించారు. అనంతరం ముంబయికి అలయన్స్ ఎయిర్ కమర్షియల్ ఫ్లయిట్కు పచ్చజెండా ఊపారు.మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది.
షిర్డీ సాయిబాబా సమాధి వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో ఏడాది పొడవున జరిగే కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది భక్తులు షిర్డీ తరలిరానున్నారు. విమానాశ్రయం ప్రారంభం కావడంతో ముంబయి-షిర్డీల మధ్య 240 కిమీ దూరం ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి కేవలం 45 నిమిషాలకు తగ్గింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







