అమెరికా పర్యటనకు వెళ్లి లాస్‌వెగాస్‌లో చిక్కుకున్న తెలుగు టూరిస్టులు

- October 02, 2017 , by Maagulf
అమెరికా పర్యటనకు వెళ్లి లాస్‌వెగాస్‌లో చిక్కుకున్న తెలుగు టూరిస్టులు

అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగువాళ్లు లాస్ వెగాస్‌లో చిక్కుకున్నారు. షూటౌట్ జరిగిన మండేలా బే హోటల్ పక్కనే ఉన్న బెలిజియా హోటల్‌లో మన తెలుగువాళ్లు బస చేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్‌లో కాల్పులు జరిగాయి. ఆ ఘటన సమయంలో తెలుగు జర్నలిస్టు ప్రేమ్ కుమార్ సమీపంలోనే ఉన్నాడు. నమస్తే తెలంగాణ నెట్‌డెస్క్‌తో అక్కడ జరిగిన అనుభవాలను అతను పంచుకున్నాడు. జర్నలిస్టు ప్రేమ్‌తో పాటు మరో అయిదుగు ప్రస్తుతం అమెరికా టూర్‌కు వెళ్లారు. అయితే లాస్ వెగాస్‌లో బస చేస్తున్న వారు కాల్పులు ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
కాల్పుల ఘటన జరగ్గానే లాస్ వెగాస్ రహదారులను మూసివేనట్లు జర్నలిస్టు ప్రేమ్ ఫోన్లో తెలిపాడు. మిత్రులు కూడా కొందరు ఆ హడావుడిలో విడిపోయినట్లు వివరించాడు. అయితే సమీప హోటల్ ప్రాంతంలోనూ జనం అంతా భయంతో నేలపై వాలారని, ఆ అయోమయంలో ఏం చేయాలో అర్థంకాక, తాము కూడా నేలపై పడుకుంటున్నట్లు తెలిపాడు. అయితే జనం పరుగుల మధ్య తమ మిత్రులందరూ చెల్లాచెదురు అయ్యారని గుర్తు చేశాడు. కానీ కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కొక్కరుగా బెలిజియా హోటల్‌కు మిత్రులు చేరుకున్నారని లాస్ వెగాస్ షూటింగ్ ఘటనను ప్రేమ్ వివరించాడు.
శుక్రవారం నుంచి లాస్‌వెగాస్‌లో ఉన్న జర్నలిస్టు ప్రేమ్ తన ఫేస్‌బుక్‌లోనూ అక్కడ తిరిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం లాస్ వెగాస్‌లో విమానాలను రద్దు చేశారు. అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు తెలుస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com