అబుధాబీలో 21,000 మందికి పైగా రెడ్ సిగ్నల్ అతిక్రమణ
- November 02, 2015
రాజధానిలో ఇంచుమించు అన్ని కూడళ్ల వద్ద కూడా అత్యాధునిక కెమెరాలు అమర్చబడి ఉన్నాయని తెలిసి కూడా, 2015 సంవత్సరపు మొదటి తొమ్మిది నెలల్లో 21,851 మంది రెడ్ సిగ్నల్ ను అతిక్రమించినట్టు, అబుధాబీ ట్రాఫిక్ పోలీసు వారి ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రోడ్ సేఫ్టీ విభాగం డైరక్టర్ - లెఫ్టనెంట్ కల్నల్ బద్ర్ అహ్మద్ అల్ హార్తి ప్రకటించారు. ప్రమాదాలను నివారించడానికి కూడళ్లను సమీపించేటపుడు వేగాన్నీ తగ్గించవలసిందిగా మరల మరల విజ్ఞప్తులు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని, ఈ విధమైన అతిక్రమణ దారులకు 800 దిర్హాం ల జరిమానా, రెండు వారాలపాటు వారి వాహన స్వాధీనం మరియు వారి ట్రాఫిక్ రికార్డులో 8 బ్లాక్ పాయింట్లు శిక్షగా విధింపబడుతుందని ఆయన తెలియజేప్పారు. ఈ కొత్త కెమెరాలు - రెడ్ సిగ్నల్ అతిక్రమించిన, వేగ పరిమితిని అధిగమించిన, సిగ్నల్స్ వద్ద హఠాత్తుగా దిశ మార్చుకున్న, యెల్లోబాక్స్ లేదా పాదచారుల నడక దారిపై ఆగిన వాహనాల చోదకులను కనిపెట్టగలవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







