మిస్టరీని ఛేదించలేకపోయాం క్షమించండి అంటున్న ఏటీఎస్బీ
- October 02, 2017
కాన్బెర్రా: మలేషియా ఎంహెచ్ 370 విమానం అదృశ్యం అతి పెద్ద మిస్టరీ అని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ఎంహెచ్370 అదృశ్యంపై దాదాపు మూడున్నర ఏళ్లుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా ట్రాన్స్పోర్ట సేఫ్టీ బ్యూరో (ఏటీఎస్బీ) బృందం దీనిపై మంగళవారం తుది నివేదకను ప్రభుత్వానికి సమర్పించింది. ఎంహెచ్ 370 ప్రయాణికులు బాధిత కుటుంబాలకు మేం న్యాయం చేయలేకపోయాం.. మమ్మల్ని క్షమించండంటూ.. రీసెర్చ్ ఏటీఎస్బీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఆధునిక ప్రపంచంలో ఈ విమాన అదృశ్యం ఎవరూ ఊహించలేనిది అని ఏటీఎస్బీ తెలిపింది. బీజింగ్ నుంచి కౌలాలంపూర్కు 2014 మార్చి 8న బయలుదేరిన ఎంహెచ్370 విమానం కొన్నిగంటల్లోనే దిశ మార్చుకుని అదృశ్యమైన విషయం తెలిసిందే.
ఎంహెచ్370 అదృశ్యం అనేది విమానయాన చరిత్రలోనే అతి పెద్ద విషాదమని ఏటీఎస్బీ చీఫ్ కమిషనర్ గ్రెగ్ హూడ్ చెప్పారు. ఈ విమానం కోసం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ ప్రపంచంలోనే అతి పెద్దది.. అయినా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం చేయలేకపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంహెచ్ 370 అదృశ్యమైన ప్రాంతంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పడమటి ప్రాంతంలోని 2,800 కిలోమీటర్ల పరిధిని అణువణువు శోధించామని.. అలాగే సముద్రగర్భంలో లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సోనార్ టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







