ట్రక్ - స్కూల్ బస్ ఢీ: నలుగురు విద్యార్థులకు గాయాలు
- October 02, 2017
ఓ ట్రక్, స్కూల్ బస్సుని ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దుబాయ్ ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులను స్కూల్ బస్, స్కూల్కి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాల మధ్యా తగినంత గ్యాప్ పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు చిన్నపాటి గాయాలు కాగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి గాయాలైన విద్యార్థులకు ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు ఇతర వాహనాలతో తగినంత గ్యాప్ మెయిన్టెయిన్ చేయాలని బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







