'క్వీన్' వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారట
- October 03, 2017

హైదరాబాద్: విద్యార్థులు, ఉద్యోగులు, స్నేహితులు ఆసక్తికర విషయాలు పంచుకోవడానికి వాట్సాప్ బృందాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. వాట్సాప్ గ్రూప్లను సెలబ్రిటీలు కూడా అనుసరిస్తుంటారు. తాజాగా కథానాయికలు తమన్నా, మంజిమ మోహన్, కాజల్ అగర్వాల్, పారుల్ యాదవ్ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారట.
ఎందుకంటే వీరు నలుగురూ హిందీలో వచ్చిన 'క్వీన్' రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో తమన్నా(క్వీన్), తమిళంలో కాజల్(పారిస్ పారిస్), మలయాళంలో మంజిమ మోహన్(జామ్ జామ్), కన్నడలో పారుల్ యాదవ్(బటర్ఫ్లై) చిత్రాల్లో నటిస్తున్నారు. వీరంతా నటించేది ఒకే సినిమా రీమేక్లో కావడంతో చిత్ర దర్శకులు, కథానాయికలు ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారట.
సినిమా వివరాలను పంచుకోవడానికి ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడానికి ఇదో సులభమైన మార్గమని ఇలా చేశారట. అంతేకాదు ఈ సినిమా నాలుగు భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







