మేథీ, కార్న్ పులావ్
- October 04, 2017
కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ - 2 కప్పులు, స్వీట్కార్న్- ఒక కప్పు, మెంతికూర- మూడు కట్టలు, టమాటాలు- రెండు, ఉల్లి పాయ- 1, పచ్చిమిర్చి- 2, కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు - తగినంత, పసుపు- చిటికెడు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా పొడి, లవం గాలు, చెక్క, షాజీర
తయారీ విధానం: బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేడిచేసి చెక్క, లవంగాలు, షాజీర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నిలువుగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడి కిన తరువాత పసుపు, కారం, ఒక టేబుల్ స్పూన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, తరి గిన మెంతికూర, స్వీట్కార్న్, ఒక టేబుల్ స్పూన గరం మసాలా పొడి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







