మేథీ, కార్న్ పులావ్
- October 04, 2017
కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ - 2 కప్పులు, స్వీట్కార్న్- ఒక కప్పు, మెంతికూర- మూడు కట్టలు, టమాటాలు- రెండు, ఉల్లి పాయ- 1, పచ్చిమిర్చి- 2, కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు - తగినంత, పసుపు- చిటికెడు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా పొడి, లవం గాలు, చెక్క, షాజీర
తయారీ విధానం: బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేడిచేసి చెక్క, లవంగాలు, షాజీర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నిలువుగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడి కిన తరువాత పసుపు, కారం, ఒక టేబుల్ స్పూన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, తరి గిన మెంతికూర, స్వీట్కార్న్, ఒక టేబుల్ స్పూన గరం మసాలా పొడి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









