4 నిమిషాల్లో 1000 మందిని ఖాళీ చేయించారు
- October 05, 2017
దుబాయ్ మునిసిపాలిటీ, నైఫ్ మార్కెట్లో 1000 మంది ప్రజల్ని కేవలం నాలుగు నిమిషాల్లోపే ఖాళీ చేయించడం జరిగింది. అయితే ఇదంతా ఓ 'డ్రిల్'లో భాగమే కావడం గమనించదగ్గ అంశం. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఈ డ్రిల్ని నిర్వహించినట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్, కార్పొరేట్ ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ టీమ్ హెడ్ మాట్లాడుతూ, అత్యంత పకడ్బందీగా ఈ డ్రిల్ చేపట్టామని అన్నారు. షాప్ల నిర్వాహకులు కూడా తమకు పూర్తిగా సహకరించారనీ, అనుకోని సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలు జాగ్రత్తగా బయటపడటమెలాగో తెలియజేశామని ఆయన చెప్పారు. 265 షాప్లు కలిగి ఉన్న నైఫ్ మార్కెట్ని నిత్యం వేలాదిమంది సందర్శిస్తుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







