4 నిమిషాల్లో 1000 మందిని ఖాళీ చేయించారు
- October 05, 2017
దుబాయ్ మునిసిపాలిటీ, నైఫ్ మార్కెట్లో 1000 మంది ప్రజల్ని కేవలం నాలుగు నిమిషాల్లోపే ఖాళీ చేయించడం జరిగింది. అయితే ఇదంతా ఓ 'డ్రిల్'లో భాగమే కావడం గమనించదగ్గ అంశం. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఈ డ్రిల్ని నిర్వహించినట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్, కార్పొరేట్ ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ టీమ్ హెడ్ మాట్లాడుతూ, అత్యంత పకడ్బందీగా ఈ డ్రిల్ చేపట్టామని అన్నారు. షాప్ల నిర్వాహకులు కూడా తమకు పూర్తిగా సహకరించారనీ, అనుకోని సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలు జాగ్రత్తగా బయటపడటమెలాగో తెలియజేశామని ఆయన చెప్పారు. 265 షాప్లు కలిగి ఉన్న నైఫ్ మార్కెట్ని నిత్యం వేలాదిమంది సందర్శిస్తుంటారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









