బుల్లి తెరపై అన్న రామ్ చరణ్ని బీట్ చేసిన తమ్ముడు వరుణ్ తేజ్
- October 06, 2017
మెగా బ్యాగ్రౌండ్ తో... ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా తమ సినిమాలను జాగ్రత్తగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు గ్యాప్ తీసుకునే మెగా హీరోలు బరిలో దిగారు. కానీ వెండితెర మీద పోటీ తప్పించుకుంటున్నా... బుల్లితెర మీద మాత్రం పోటీ తప్పలేదు. సెప్టెంబర్ 24న ఒకే టైమ్ లో ఇద్దరు మెగా హీరోల సినిమా పోటీగా ప్రసారం అయ్యాయి. ఆ సినిమాలే వరుణ్ తేజ్ నటించిన ఫిదా, రామ్ చరణ్ నటించిన ధృవ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకొన్నాయి. కానీ బుల్లితెర మీద మాత్రం అన్న రామ్ చరణ్ మీద, తమ్ముడు వరుణ్ తేజ్ పై చేయి సాధించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేమకథాంశంతో వచ్చిన ఫిదాని చూసి. సిల్వర్ స్క్రీన్ మీద అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ సాయిపల్లవికి యూత్ ఫిదా అయ్యింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రామ్ చరణ్ ధృవ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యింది. డీమానిటైజేషన్ ని తట్టుకుని మరి భారీ కలెక్షన్లు సాధించింది. సెప్టెంబర్ 24 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ మాటీవిలో ఫిదా టెలికాస్ట్ అయ్యింది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు జెమినీ టివిలో ధృవ టెలికాస్ట్ అయ్యింది. ఈ రెండు సినిమాలకు రేటింగ్ చూస్తే... ఫిదాకి 15.77 రేటింగ్ వస్తే..ధృవకి 10.47 మాత్రమే రేటింగ్ వచ్చింది. అంటే రామ్ చరణ్ సినిమా కంటే వరుణ్ తేజ్ మూవీకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో..బుల్లి తెరపై అన్నపై తమ్ముడు పై చేయి సాధించాడు..
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







