పాకిస్తానీ ఇంజినీర్ ను కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డు
- October 06, 2017
దుబాయ్: పరాయి దేశంలో జీవిస్తున్నప్పుడు ఒకే దేశం వారు ఐక్యంగా ఉండటం సహజం. కానీ స్వదేశంకు చెందిన వ్యక్తిని డబ్బు కోసం కిడ్నప్ చేసిన ఉదంతం ఇది. జూన్ 20 న అల్ క్కుసైస్ లో జరిగిన సంఘటనలో 52 ఏళ్ల పాకిస్థానీ వ్యాపారి తన దేశానికి చెందిన ఇంజినీర్ స్నేహితుడిని బలవంతంగా అపహరించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని అజ్మాన్ కు తీసుకెళ్లాక, కిడ్నప్ నుంచి విడిచిపెట్టాలంటే 5,400 ధిర్హాంలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పాకిస్తాన్ ఇంజినీర్ కోర్టు లో మాట్లాడుతూ, "నేను మెట్రో స్టేషన్ వద్ద నుంచొని ఉన్నప్పుడు ఒక బస్సు వచ్చి నా ముందు ఆగింది కొంతమంది వ్యక్తులు మధ్యాహ్నం 2:30 గంటలకు ఒక్కసారిగా నాపై దాడి చేసి బలవంతాన బస్సులోకి ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని " తెలిపాడు "వారు అజ్మాన్ లోని ఒక ఏకాంత ప్రదేశానికి నన్ను విడిచిపెట్టారు, అక్కడ వారు నాతో 5,400 ధిర్హాంలు చెల్లించమని ఆదేశాలు ఇచ్చారు, ఎవరినైనా పిలిపించి ఆ సొమ్ము మాకు ఇవ్వాలని బెదిరించారు. దానితో నేను నా స్నేహితుడిని పిలిపించి ఆ డబ్బు వారికి ఇప్పించానని పేర్కొన్నాడు ఒక పోలీసు లెఫ్టినెంట్ మాట్లాడుతూ, "బాధితుడైన ఇంజినీర్ ముఖంపై పిడి గుద్దులు కురిపించినట్లు ఆనవాళ్లు తలపై గాయాలు మరియు శరీరంపై కత్తితో గీసినట్లు చారలు కలిగి ఉన్నాడు,ఈ కేసుకి సంబంధించిన విచారణ అక్టోబర్ 26 వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







