' ఫోర్బ్స్' లిస్టులో పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ

- October 07, 2017 , by Maagulf
' ఫోర్బ్స్' లిస్టులో పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ

యోగాగురు బాబా రాందేవ్ సన్నిహితుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ ఈ సారి మరింత సంపదతో ఇంకా బిలియనీర్ అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ధనవంతులైన (భారత్ లో)వారి పేర్లతో కూడిన లిస్టులో ఈ ఏడాది ఈయన 19 వ స్థానానికి చేరుకున్నాడు. గత సంవత్సరం 45 వ ప్లేస్ లో ఉన్న ఆచార్య బాలకృష్ణ 43 వేల కోట్ల సంపదతో ఈ ఏడాది 19 వ స్థానానికి జంప్ కావడం విశేషం. (యాన్యువల్ ఇండియా రిచ్-2017 పేరిట ఈ మ్యాగజైన్ ప్రతి ఏడాదీ మన దేశంలోని బిలియనీర్ల జాబితాను ప్రచురిస్తోంది).
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేష్ అంబానీ ఎప్పటిలాగే ఈ సారీ 10 వ స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన రూ.2.48 లక్షల కోట్లు. ఆ తర్వాత విప్రో అధినేత ఆజం ప్రేమ్ జీ (రూ.1,24,051 కోట్లు), హిందూజా బ్రదర్స్            ( 1,20,133 కోట్లు), లక్ష్మీ మిట్టల్ (1,07,728 కోట్లు), పల్లోంజీ మిస్త్రీ (1,04,464 కోట్లు) సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ (79 వేల కోట్లు) ఆక్రమించగా అనిల్ అంబానీ 45 వ స్థానానికి దిగజారారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com