చైనా-భారత్ సరిహద్దుల్లో పర్యటించిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
- October 08, 2017
అసలే.. చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సరిహద్దుల్లో పర్యటించారు దేశ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్. సాధారణంగా ఇలాంటి పర్యటనలపై భగ్గుమంటుంది చైనా ప్రభుత్వం. కానీ.. సీతారామన్ మాత్రం.. సరిహద్దుల్లో టెన్షన్ను తగ్గించడం కోసం.. ఈ టూర్లో తనదైన మార్క్ను చూపించారు.
రెండు దేశాలకు కీలకమైన నాథు లా పాస్ దగ్గర సైనికాధికారులతో సమావేశమై.. సరిహద్దుల్లో మోహరింపుపై ఆరా తీశారు. ఇదే సమయంలో.. చైనా భూభాగం నుంచి ఆ దేశ సైనికులు సీతారామన్ను ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన ఆమె... చేయి ఊపుతూ.. వారిని పలకరించారు.
ఆ తర్వాత.. భారత సైనికాధికారులతో కలిసి.. చైనా సైనికాధికారులను కలుసుకున్నారు రక్షణమంత్రి. వారికి నమస్తే చెప్పారు.. నమస్తే అంటే అర్థం చెప్పి.. అక్కడున్న ప్రతీ ఒక్కరితో నమస్తే పెట్టించారు. ఇలా గతంలో ఏ రక్షణ మంత్రి నేరుగా సరిహద్దుల్లో చైనా సైనికులతో చర్చించిన సందర్భాలు లేవు. నిర్మలా యాక్షన్కు కూల్ అయిపోయారు చైనా భద్రతా సిబ్బంది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ.. సీతారామన్ ఆ దేశ సైనికులతో సరదాగా ముచ్చటించడం వల్ల.. ఉద్రిక్తతలు తగ్గుతాయన్న వాదన వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







