చైనా-భారత్ సరిహద్దుల్లో పర్యటించిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
- October 08, 2017
అసలే.. చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సరిహద్దుల్లో పర్యటించారు దేశ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్. సాధారణంగా ఇలాంటి పర్యటనలపై భగ్గుమంటుంది చైనా ప్రభుత్వం. కానీ.. సీతారామన్ మాత్రం.. సరిహద్దుల్లో టెన్షన్ను తగ్గించడం కోసం.. ఈ టూర్లో తనదైన మార్క్ను చూపించారు.
రెండు దేశాలకు కీలకమైన నాథు లా పాస్ దగ్గర సైనికాధికారులతో సమావేశమై.. సరిహద్దుల్లో మోహరింపుపై ఆరా తీశారు. ఇదే సమయంలో.. చైనా భూభాగం నుంచి ఆ దేశ సైనికులు సీతారామన్ను ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన ఆమె... చేయి ఊపుతూ.. వారిని పలకరించారు.
ఆ తర్వాత.. భారత సైనికాధికారులతో కలిసి.. చైనా సైనికాధికారులను కలుసుకున్నారు రక్షణమంత్రి. వారికి నమస్తే చెప్పారు.. నమస్తే అంటే అర్థం చెప్పి.. అక్కడున్న ప్రతీ ఒక్కరితో నమస్తే పెట్టించారు. ఇలా గతంలో ఏ రక్షణ మంత్రి నేరుగా సరిహద్దుల్లో చైనా సైనికులతో చర్చించిన సందర్భాలు లేవు. నిర్మలా యాక్షన్కు కూల్ అయిపోయారు చైనా భద్రతా సిబ్బంది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ.. సీతారామన్ ఆ దేశ సైనికులతో సరదాగా ముచ్చటించడం వల్ల.. ఉద్రిక్తతలు తగ్గుతాయన్న వాదన వినిపిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







