రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
- October 08, 2017
రాజధానికి భూములిచ్చిన రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న రైతుల నుంచి AP CRDA దరఖాస్తులు తీసుకొంది. మొత్తం 123 మంది రైతులు సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించారు. అయితే 100 మందిని మాత్రమే తీసుకెళ్లాలనుకున్న ప్రభుత్వం... ఇవాళ లాటరీ ద్వారా వారిని ఎంపిక చేసింది. అయితే ఇంకా కేవలం 23 మంది మాత్రమే ఉండటంతో వారిని కూడా సింగపూర్ తీసుకెళ్లేందుకు సీఎం అనుమతి తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. ఈనెల 22 నుంచి మూడు విడతలుగా 100 మంది రైతులను సింగపూర్ కు తీసుకెళ్లనున్నారు. ఇక మిగిలిన వారిని నాలుగోవిడతలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు నారాయణ. సింగపూర్ ఎలా అభివృద్ది చెందింది. ఇక్కడ రైతులు తమ భూములను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పించనున్నారు. అటు ఈనెల 12 నుంచి దర్శకుడు రాజమౌళి, సీఆర్డీఏ అధికారులు లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో డిజైన్లపై చర్చించనున్నట్లు నారాయణ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







