రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
- October 08, 2017రాజధానికి భూములిచ్చిన రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న రైతుల నుంచి AP CRDA దరఖాస్తులు తీసుకొంది. మొత్తం 123 మంది రైతులు సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించారు. అయితే 100 మందిని మాత్రమే తీసుకెళ్లాలనుకున్న ప్రభుత్వం... ఇవాళ లాటరీ ద్వారా వారిని ఎంపిక చేసింది. అయితే ఇంకా కేవలం 23 మంది మాత్రమే ఉండటంతో వారిని కూడా సింగపూర్ తీసుకెళ్లేందుకు సీఎం అనుమతి తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. ఈనెల 22 నుంచి మూడు విడతలుగా 100 మంది రైతులను సింగపూర్ కు తీసుకెళ్లనున్నారు. ఇక మిగిలిన వారిని నాలుగోవిడతలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు నారాయణ. సింగపూర్ ఎలా అభివృద్ది చెందింది. ఇక్కడ రైతులు తమ భూములను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పించనున్నారు. అటు ఈనెల 12 నుంచి దర్శకుడు రాజమౌళి, సీఆర్డీఏ అధికారులు లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో డిజైన్లపై చర్చించనున్నట్లు నారాయణ చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ