రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
- October 08, 2017
రాజధానికి భూములిచ్చిన రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న రైతుల నుంచి AP CRDA దరఖాస్తులు తీసుకొంది. మొత్తం 123 మంది రైతులు సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించారు. అయితే 100 మందిని మాత్రమే తీసుకెళ్లాలనుకున్న ప్రభుత్వం... ఇవాళ లాటరీ ద్వారా వారిని ఎంపిక చేసింది. అయితే ఇంకా కేవలం 23 మంది మాత్రమే ఉండటంతో వారిని కూడా సింగపూర్ తీసుకెళ్లేందుకు సీఎం అనుమతి తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. ఈనెల 22 నుంచి మూడు విడతలుగా 100 మంది రైతులను సింగపూర్ కు తీసుకెళ్లనున్నారు. ఇక మిగిలిన వారిని నాలుగోవిడతలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు నారాయణ. సింగపూర్ ఎలా అభివృద్ది చెందింది. ఇక్కడ రైతులు తమ భూములను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పించనున్నారు. అటు ఈనెల 12 నుంచి దర్శకుడు రాజమౌళి, సీఆర్డీఏ అధికారులు లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో డిజైన్లపై చర్చించనున్నట్లు నారాయణ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







