విదేశీ విరాళాలపై విచారణకు ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది
- October 09, 2017
రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై విచారణకు చివరి అవకాశంగా కేంద్రానికి ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విషయంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ హరి శంకర్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 2014లో తాము ఇచ్చిన తీర్పును అమలుచేసేందుకు కేంద్ర హోం శాఖకు ఇస్తున్న చివరి అవకాశం ఇదేనని వ్యాఖ్యానించింది. ఎఫ్సీఆర్ఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. బ్రిటన్ సంస్థ 'వేదాంత రిసోర్సెస్'కు చెందిన భారత విభాగం నుంచి రాజకీయ పార్టీలు నిధులు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మార్చి 25, 2014న ఎన్నికల సంఘం, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. రాజకీయ పార్టీల ఖాతాలపై విచారణ చేపట్టి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే కోర్టు తీర్పును అమలుచేసేందుకు గడువు కావాలని కోర్టును కేంద్ర హోం శాఖ పలుమార్లు కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







