విదేశీ విరాళాలపై విచారణకు ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది

- October 09, 2017 , by Maagulf
విదేశీ విరాళాలపై విచారణకు ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది

 రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై విచారణకు చివరి అవకాశంగా కేంద్రానికి ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విషయంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌, జస్టిస్‌ హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 2014లో తాము ఇచ్చిన తీర్పును అమలుచేసేందుకు కేంద్ర హోం శాఖకు ఇస్తున్న చివరి అవకాశం ఇదేనని వ్యాఖ్యానించింది. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. బ్రిటన్‌ సంస్థ 'వేదాంత రిసోర్సెస్‌'కు చెందిన భారత విభాగం నుంచి రాజకీయ పార్టీలు నిధులు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మార్చి 25, 2014న ఎన్నికల సంఘం, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. రాజకీయ పార్టీల ఖాతాలపై విచారణ చేపట్టి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే కోర్టు తీర్పును అమలుచేసేందుకు గడువు కావాలని కోర్టును కేంద్ర హోం శాఖ పలుమార్లు కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com