మహిళా కొలీగ్కి అసభ్య సందేశాలు: నిందితుడికి జరీమానా
- October 09, 2017
మొబైల్ ఫోన్ ద్వారా తన కొలీగ్ అయిన ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకుగాను ఓ వ్యక్తికి న్యాయస్థానం 50,000 దిర్హామ్ల జరీమానా విధించింది. బాధిత మహిళ, తాను పనిచేస్తున్న కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. తన వర్క్ మేట్ ఫోన్ని ఉపయోగించి, మహిళపై నిందితుడు అసభ్యకరమైన పదజాలంతో మెసేజ్ల ద్వారా వేధింపులకు గురిచేశాడు. అయితే ఇదంతా తనకు తెలిసి జరగలేదని ఆ ఫోన్ వినియోగదారుడు పోలీసులకు విన్నవించడం జరిగింది. ఇంకో వైపున బాధితురాలి తరఫు లాయర్, తన క్లయింట్ తీవ్ర మానసిక వేధనను అనుభవించారని, నిందితుడిపై సివిల్ కేసు ఫైల్ చేయనున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







