హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్‌,ఆస్ట్రేలియా టీ-ట్వంటీ టిక్కెట్లు

- October 10, 2017 , by Maagulf
హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్‌,ఆస్ట్రేలియా టీ-ట్వంటీ టిక్కెట్లు

హైదరాబాద్‌లో అక్టోబర్ 13న జరిగే భారత్‌,ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న అభిమానులు జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రెడీమ్ కౌంటర్‌కు క్యూ కట్టడంతో అక్కడ సందడి నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి అభిమానులు కోసం 39వేల వరకూ టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.వివేక్ చెప్పారు. లోథా కమిటీ సిఫార్సులను అనుసరిస్తూ కాంప్లిమెంటరీలను 15 శాతానికి తగ్గించినట్టు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com